షర్మిల నేటి పాదయాత్ర కొనసాగేది ఇలా..

సత్తెనపల్లి (గుంటూరు జిల్లా), 5 మార్చి 2013: మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ, జననేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం సత్తెనపల్లి నియోజకవర్గంలో సాగనుందని వైయస్‌ఆర్‌ గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖ‌ర్, పార్టీ కార్యక్రమాల ‌రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. సోమవారం రాత్రి బసచేసిన వెంకటపతినగర్‌ నుంచి మంగళవారం ఉదయం‌ శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇరుకుపాలెం, మాదల, బొల్లారం క్రాస్‌రోడ్ మీదుగా మధ్యాహ్న భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. ‌అనంతరం చాగంటివారిపాలెం, ముప్పాళ్ల, గొల్లపాడు మీదుగా రాత్రి బసకు శ్రీమతి షర్మిల చేరుకుంటారు.
Back to Top