వైఎస్సార్ జిల్లా(కమలాపురం): వైఎస్సార్సీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి టీడీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వేసవిలో కరవు కాటకాలతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతోంటే ...గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కరెంటు బిల్లులు చెల్లించాలంటూ ప్రభుత్వం వారిపై ఒత్తిడి తీసుకురావటం అన్యాయమన్నారు. కమలాపురం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో రవీంద్రనాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. <br/>ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తూ ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగుబలహీన వర్గాలకు కృషిచేస్తున్నామంటూ ప్రచార ఆర్భాటాలతో, అబద్ధాలతో వారిని దగా చేస్తున్నారని విమర్శించారు.