ప్రొద్దుటూరు టౌన్ : పట్టణంలోని ఒకటో వార్డులో ఉన్న బొల్లవరంలో సీసీ రోడ్డు, కాలువ నిర్మాణానికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. రూ.5.72 లక్షలతో కాలువ, రూ.6.20 లక్షలతో రోడ్డు నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ అబీద్ హుసేన్, ఒకటో వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ గోనా సరస్వతి, నాయకులు పోసా భాస్కర్, గోనా ప్రభాకర్రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.<br/>