టీడీపీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ..

విజయనగరంః వైయస్‌ జగన్‌కు పార్వతీపురం నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జోగారావు అన్నారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం తర్వాత తొలిసారిగా నేడు పార్వతీపురం బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారని, ఆయన ఏం మాట్లాడతారో నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతపై కూడాను అంతం చేయడానికి అరాచకాలకు పాల్పడుతుందని విమర్శించారు. పార్వతీపురం నియోజకవర్గంల అనేక సమస్యలు ఉన్నాయన్నారు. సీతానగరం మండలంలో చెరకు రైతులకు సుమారు 11 కోట్ల 30 లక్షల రూపాయాలు బకాయిలు చెల్లించకుండా నడ్డి విరిచిందన్నారు. చెరకు రైతుల సమస్యలను వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు.పార్వతీపురం పట్టణంలో తాగునీటి సమస్య, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ గురించి వివరించామన్నారు. 
Back to Top