నెల్లూరు జిల్లా టీడీపీకి షాక్‌

నెల్లూరు: జిల్లా టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆదాల అనుచరుడు వైవి రామిరెడ్డి జనవరి 9న వైయస్‌ఆర్‌సీపీలోకి చేరనున్నారు. ఇప్పటికే జిల్లాలో  పలువురు టీడీపీపార్టీని వీడగా, తాజాగా సీనియర్‌ నాయకుడిగా ఉన్న వైవీ రామిరెడ్డి పార్టీని నుంచి వైదొలిగారు. 2019 జనవరి 9న వైయస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో రామిరెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. జిల్లాలో పార్టీకి చెందిన ఎంపీలు,మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల సమక్షంలో వైవి రామిరెడ్డి  పార్టీలోకి చేరనున్నారు. అనంతరం 11న నెల్లూలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

Back to Top