రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
బాబు అవినీతే ఏపీ అభివృద్ధికి అవరోధం
09 Dec 2017 11:58 AM
విశాఖ: చంద్రబాబు అవినీతి కారణంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్రం నిధులు సక్రమంగా రావడం లేదని, రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు అవినీతే అవరోధమని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. విశాఖలో నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన టీడీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ క్యాబినేట్ సమావేశాల్లో ప్రజా సమస్యలకు బదులుగా భూసేకరణ గురించి మాత్రమే చర్చించారన్నారు. అవినీతి చేయడం ఎలా అన్న అంశంపై ప్రస్తుతం లోకేష్కు ట్రైనింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మూడున్నరేళ్లలో ప్రభుత్వం రూ.2.26 లక్షల వేల కోట్లు అప్పు చేసిందన్నారు. ఏపీలో అవినీతి ఎక్కువ అని జపాన్ కంపెనీలు చెబుతున్నాయని తెలిపారు.