జగన్మోహన్‌రెడ్డికి తప్పక న్యాయం జరుగుతుంది

నెల్లూరు, 27 సెప్టెంబర్‌ 2012: నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర గురువారం ఉదయం ఇక్కడ ప్రారంభమైంది. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు వై‌యస్ జగ‌న్మోహన్‌రెడ్డికి బెయిల్ ‌మంజూరు కావాలని కోరుతూ మేకపాటి ఈ పాదయాత్ర ప్రారంభించారు. నగరంలోని తన స్వగృహం నుంచి వేదగిరి లక్ష్మీనర్సింహస్వామి కొండ వరకు ఆయన పాద్రయాత్ర 20 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది.

పాదయాత్ర ప్రారంభం సందర్భంగా రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్‌రెడ్డికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని అన్నారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక అధికార, ‌ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.

పాదయాత్రకు జిల్లా నలు మూలల నుంచీ వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, జిల్లా కన్వీనర్ కాకాని గోవ‌ర్దన్‌రెడ్డి, సెంట్రల్‌ గవర్నింగ్‌ కమిటీ సభ్యుడు గోపాల్‌రెడ్డి తదితరులు మేకపాటితో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు.

కాగా, పాదయాత్రలో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏర్పాట్లను ఎంపీ మేకపాటి స్వయంగా పర్యవేక్షించారు. కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు, ప్రజలు భారీగా హాజరయ్యారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Back to Top