గొర్రెల‌కు బీమా సౌకర్యం లేదన్నా..

విజయనగరంః చీపురుపల్లి మండలం కోటగండ్రేడు గ్రామంలో వైయస్‌ జగన్‌ యాదవుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు ఇప్పించాలని, గొర్రెల‌కు బీమా కల్పించాలని వైయస్‌ జగన్‌ను  కోరారు. టీడీపీ పాలనలో యాదవులను పట్టించుకోలేదన్నారు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా కూడా ఆర్థికసాయం అందించడం లేదన్నారు. గొర్రెల‌తో ఎక్కువగా తిరగడం వలన ఆరోగ్యం కూడా త్వరగా క్షిణిస్తుందని, 40 ఏళ్లకు పింఛను సౌకర్యం కల్పించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత  న్యాయం చేస్తానని జననేత భరోసా ఇచ్చారు. వైయస్‌ జగన్‌ హామీ పట్ల యాదవులు హర్షం వ్యక్తం చేశారు. 

Back to Top