మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
టీడీపీ మహానాడులో పరనింద.. సొంత డబ్బా
28 May 2014 1:27 PM
హైదరాబాద్:
టీడీపీ మహానాడు జరుగుతున్న తీరు సొంత డబ్బా కొట్టుకుంటూ.. పరనిందలా చేసేలా కొనసాగుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రజల ఆశలకు అనుగుణంగా, హామీలకు భరోసా ఇచ్చే విధంగా తీర్మానాలు ఉంటాయనుకున్న వారి ఆశలను టీడీపీ వమ్ము చేస్తోందన్నారు. రాబోయే కాలాన్ని చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది తప్ప, పరిపాలన సాగించే దమ్మున్న నాయకుడిగా లేదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో మంగళవారంనాడు మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయక ముందే టీడీపీ కార్యకర్తలను మోసం చేసే చర్యలకు చంద్రబాబు దిగుతున్నారని గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. 2019 ఎన్నికలకు సిద్ధం కావాలంటూ నాలుగు రకాల కార్యక్రమాలకు సిద్ధపడినట్లుగా కనిపిస్తోందన్నారు. ‘టీడీపీ కార్యకర్తలను మభ్యపెట్టడం, ప్రతిపక్షాన్ని బలహీనపరచాలనే దుర్బుద్ధి, తన నిజస్వరూపం బయటపడకుండా మోడీ ముసుగును కొనసాగించడం, హామీలకు తూట్లు పొడిచే బీద అరుపులు అరవడం’ వంటి నాలుగు రకాల కార్యక్రమాలను చంద్రబాబు ఎంచుకున్నట్లు కనిపిస్తోందన్నారు.
‘ప్రత్యర్థుల మీద టీడీపీకి కక్షసాధింపు ఉండదని, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పరిపాలన ప్రారంభం కాగానే టీడీపీ కార్యకర్తల హత్యలకు పురిగొల్పారంటూ ద్వేషాన్ని నింపే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. వైయస్ఆర్ పరిపాలన కేవలం టీడీపీ కార్యకర్తలను చంపడానికి ప్రారంభించారనడాన్ని.. ఆ పార్టీ కార్యకర్తలు మననం చేసుకోవాల’ని అన్నారు.