కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
చాలా మంది కాంగ్రెస్ నేతలు వస్తున్నారు
13 Nov 2018 12:37 PM
విజయవాడ: చంద్రబాబు కాంగ్రెస్తో కలవడం చాలా మందికి నచ్చడం లేదని, అందుకే త్వరలోనే ఆ పార్టీ నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని మాజీ మంత్రి సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. విజయనగరంలో వైయస్ జగన్ సమయంలో వైయస్ఆర్సీపీలో చేరిన రామచంద్రయ్య మీడియాతో మాట్లాడారు. వైయస్ఆర్సీపీలో చేరడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తాను పార్టీలో చేరేందుకు కృషి చేసిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ భావాలతో టీడీపీ పుట్టిందో అది ఇప్పుడు లేదన్నారు. ఇప్పుడు తల్లి కాంగ్రెస్ కాళ్లు పట్టుకుని దేశంలో చక్రం తిప్పుతానని చంద్రబాబు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. వైయస్ఆర్కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా చాలా మంది కాంగ్రెస్ నేతలు వస్తారని పేర్కొన్నారు.