నోట్: పాస్పోట్ గుంటూరు: స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఓటుకు నోటు విషయంలో డబ్బులు ఇచ్చేందుకు చంద్రబాబే తనతో ఫోనులో మాట్లాడారని కోర్టుకు స్టీఫన్సన్ వాగ్మూలం ఇచ్చిన తరువాత కూడా ఆయన రాజీనామా చేయకపోవడం సిగ్గుచేటన్నారు. గుంటూరులోని ఓ ప్రైవేటు హోటల్లో అంబటి విలేకరులతో మాట్లాడారు. గత నెల 31వ తేదీ నుంచి రేవంత్రెడ్డి విషయంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. స్టీఫన్సన్తో జరిగిన ఫోను సంభాషణల్లో ఉన్నది తన గొంతు కాదని చంద్రబాబు ఇప్పటి వరకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారన్నారు. కేసులో నిందితుడైన ముత్తయ్యను విజయవాడలో పోలీసుల సంరక్షణలో ఉంచటం, సండ్రను విశాఖపట్నంలో ఆస్పత్రిలో చేర్పించి నాటకాలు ఆడటం రాజ్యాంగ విలువలను చంద్రబాబు అపహాస్యం చేయటమేనన్నారు.