రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
జైలుకు పోతావని భయమా బాబు
06 May 2016 3:22 PM
హైదరాబాద్ః రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వమని కేంద్రం చెబుతుంటే... బీజేపీని విమర్శించొద్దంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. కేంద్రంలో మంత్రులను ఉపసంహరించుకోకుండా...మళ్లీ ఢిల్లీ వెళ్లి పోరాడుతామంటూ చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు. బాబు మాటలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని అంబటి చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు.
చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టుపెట్టాడని అంబటి మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో జైలుకు పోతానన్న భయంతోనే చంద్రబాబు నోట మోడీ, కేసీఆర్ ల మాట రావడం లేదని ఎద్దేవా చేశారు. భయాన్ని వీడి ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతున్న తమతో కలిసి రావాలని అంబటి బాబుకు సూచించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే వైఎస్సార్సీపీకి ముఖ్యమని... మీరు పోరాటం చేస్తారా...పోరాటం చేస్తున్న తమతో కలిసివస్తారో తేల్చుకోవాలన్నారు.