హైదరాబాద్) పార్టీని సంస్థాగతంగా పటిష్టపరచుకొనే క్రమంలో వైయస్సార్సీపీ కొన్ని నియామకాలు చేపట్టింది. పార్టీ అధికార ప్రతినిధిగా విజయవాడ సెంట్రల్ నియోజక వర్గానికి చెందిన గౌతమ్ రెడ్డి ని నియమించింది. అనంతపురం అర్బన్ కు చెందిన బుర్రా సురేష్ గౌడ్ ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.