కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
సొమ్మొకడిది.... సోకొకడిది: షర్మిల
29 Oct 2012 7:33 PM
అనంతపురం, 29 అక్టోబర్ 2012: మంత్రి రఘువీరారెడ్డి తీరు చూస్తుంటే.. 'సొమ్మొకరిది.. సోకొకరిది' అన్న చందంగా ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. అనంతపురం ప్రజలకు నీటి సౌకర్యం కలిగించే హంద్రీ నీవా పథకం కోసం పాదయాత్ర చేసిన పనులు పూర్తిచేస్తానని చెప్పడాన్ని షర్మిల ప్రస్తావించారు. అలాగైనా ఈ ప్రాజెక్టు పూర్తయి, అనంతపురం ప్రజలకు నీటి సౌకర్యం కలిగితే మంచిదే అని ఆమె వ్యాఖ్యానించారు.
దివంగత మహానేత, తన తండ్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హంద్రీ నీవా పథకానికి తన హయాంలో 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 95 శాతం పూర్తి చేశారని గుర్తు చేశారు. మిగతా 5 శాతం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేవలం 45 కోట్లు వ్యయం చేస్తే సరిపోతుందన్నారు. అయితే, ఆ కొద్దిపాటి పనులు చేయడానికి ప్రస్తుత ప్రభుత్వానికి మూడేళ్ళ సమయం కూడా సరిపోలేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రఘువీరారెడ్డి హంద్రీ నీవా పథకాన్ని పూర్తిచేస్తాననడాన్ని తమ ప్రాంతంలో 'సొమ్మొకడిది... సోకొకడిది' అంటారని అన్నారు.