వైయస్ఆర్ జిల్లా: రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ విఫలమయ్యిందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్బాబు అన్నారు. 27న కడప కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మహాధర్నాలో జిల్లావ్యాప్తంగా వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, రైతులు పాల్గొంటారన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరీ అవలభిస్తుందని, వైయస్ఆర్సీపీ ఎన్ని «ధర్నాలు చేసిన ఇప్పుడు వరుకు ఇన్ఫుట్ సబ్సిడీ విడుదల చేయకపోవడం దారుణమన్నారు.