వైయస్‌ జగన్‌ను కలిసిన 108 ఉద్యోగులు

కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని 108 ఉద్యోగులు కలిసి తమ ఇబ్బందులను లె లిపారు.  108 అంబులెన్స్‌ల్లో కనీస సౌకర్యాలు లేవని ఉద్యోగులు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. రోజుకు 12 గంటలు కష్టపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే జీతాలు పెంచాలని ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కోరారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ మనందరి ప్రభుత్వం రాగానే 108కు పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 
 
Back to Top