తాడేపల్లి: రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ‘పవిత్ర రథసప్తమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి, విజయాలను ప్రసాదించాలని ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.