కామర్స్ స్టాండింగ్‌ కమిటీకి రాజ్యసభ చైర్మన్‌ అభినందనలు

న్యూఢిల్లీ : వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి నేతృత్వంలోని కామర్స్‌ పార్లమెంటరీ స్థాయీ సంఘం పనితీరును ప్రశంసిస్తూ ఈ రోజు రాజ్యసభలో చైర్మన్  ఎం.వెంకయ్య నాయుడు అభినందించారు. పార్లమెంట్‌ సమావేశాల విరామ కాలంలో వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాల పనితీరును విశ్లేషించిన ఆయన కామర్స్‌ కమిటీ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని ప్రశంసించారు. పార్లమెంట్‌ విరామ కాలంలో మొత్తం ఆరుసార్లు సమావేశమై 15 గంటల 51 నిమిషాలపాటు వివిధ అంశాలపై చర్చలు జరిపిందని చైర్మన్‌ తెలిపారు. కమిటీ మొత్తం జరిపిన సమావేశాలలో 31 శాతం ఈ కాలవ్యవధిలోనే నిర్వహించడం పట్ల ఆయన కమిటీ చైర్మన్‌, సభ్యులను ఆయన అభినందించారు.
 

Back to Top