మధ్యాహ్నం పార్లమెంటరీ పార్టీ సమావేశం

తాడేపల్లి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం వైయస్‌ జగన్‌ ఎంపీలతో చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. ఆంధ్రరాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రత్యేక హోదా సాధనకు పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. 

   

Read Also: పేదలు తెలుగు మీడియంలోనే మగ్గిపోవాలా? 

Back to Top