సాగునీటి ప్రాజెక్టుల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి:  రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హిస్తున్న స‌మీక్ష‌లో మంత్రి  అనిల్ కుమార్ యాద‌వ్‌, ఇరిగేష‌న్ అధికారులు పాల్గొన్నారు. ఇటీవ‌ల భారీ వ‌ర్షాలు కుర‌స్తున్న నేప‌థ్యంలో ఎగువ నుంచి ప్రాజెక్టుల‌కు భారీగా వ‌ర‌ద నీరు వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో తీసుకోవాల్సిన చర్య‌ల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు. 

Back to Top