విజయనగరంః దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాస్థానం నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు వరుకూ వివిధ పత్రికల్లో వచ్చిన ఫొటోలను సేకరించి ఆల్బమ్లో రూపంలో ఓ అభిమాని పదిలపరిచారు. బొబ్బిలి నియోజకవర్గం మెట్టవలస గ్రామానికి చెందిన చింతాడ సింహాచలం కుటుంబం వైయస్ఆర్ హయాంలో ఎంతో లబ్ధి పొందింది. చంద్రబాబు వచ్చిన తర్వాత తన లాంటి పేదల కష్టాలను కలచివేశాయి. అందుకే వైయస్ జగన్ నాయకత్వం రావాలని..మళ్లీ రాజన్న రాజ్యం రావాలని ఆశపడుతున్నారు. అభిమానంతో వైయస్ఆర్ పాదయాత్ర, సంక్షేమ ఫలాల దృశ్యమాలికలను ఆల్బమ్ తయారుచేసి వైయస్ జగన్కు కానుకగా ఇవ్వడానికి ప్రజా సంకల్పయాత్రకు వచ్చినట్లు ఆయన తెలిపారు. <br/>