<br/>భాగ్యనగరాన్ని బాబుగారే నిర్మించారు. చార్మినార్ కు చంద్రబాబే శంకుస్థాపన చేసారు.గోల్కొండ కోట నిజానికి నారా కోట దయాధర్మంగా హైదరాబాద్ నవాబులకు రాసిచ్చేసారు.మూసీనది ముఖం కడుక్కోడానికి, టాంకుబండు దూకి ఈతకొట్టడానికి బాబే కట్టాడు...బిర్లామందిర్ బనాయించింది బాబే...ఫలక్ నామా పాలెస్ పునాదిరాయి బాబేసిందే...సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ , కాచీగూడా రైల్వేస్టేషన్లు కట్టింది బాబే..ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగు రోడ్డు, మెట్రోరైలు ప్రతిదీ బాబు ఘనతే...ఆట్టే ఆక్షేపిస్తే అసలు హైదరాబాద్ కు ఆ పేరు పెట్టిందే చంద్రాబు...చూసారా నవాబుల్లో ఒకడన్నమాట...పిచ్చి ముదిరితే ఎవరైనా రోకలి తలకు కట్టమంటారు...బాబు మాత్రం హైదరాబాద్ ను నా జడలో పెట్టండి అంటాడు. అన్నీ చేసింది నేనే...అంతా చేసింది నేనే అనే బాబుకు ఉన్న ఈ వ్యాధిపేరేమిటో ప్రపంచంలో ఏడాక్టరూ కనిపెట్టలేకపోతున్నాడు. అదేమిటో మీకైనా తెలుసా!!తెలిస్తే అమరావతిలో ఎర్రగడ్డ లేదుగనుక భ్రమరావతిలో కాట్రగడ్డకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించ ప్రార్థన.