కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
హోదా, విభజన హామీలు సాధించి తీరుతాం
25 May 2019 5:37 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగాం సురేష్
అమరావతి: విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధించేందుకు ఎంపీలంతా కలిసికట్టుగా ఉండాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం నందిగాం సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. నాయకుడికి క్యారెక్టర్ ఉండాలి.. క్యారెక్టర్తోనే ముందుకు వెళ్లాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ సూచించారన్నారు. గతంలో ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశాడని, దొంగతనం చేసిన సీట్లనే భగవంతుడు చంద్రబాబు ఇచ్చాడన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు రాబట్టుకునేందుకు ఎంపీలంతా ఒక్కతాటిపై ఉండి సాధించే దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు. వైయస్ జగన్ నాయకత్వంలో ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించి తీరుతామన్నారు.