చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
బాబు ఐదేళ్ల పాలనలో అన్ని శాఖలు నిర్వీర్యం
28 Aug 2019 12:13 PM
వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకురాలు లక్ష్మీపార్వతి
విశాఖ: రైతుల దృష్టిని మరల్చేందుకే రాజధానిపై ప్రతిపక్షం దుమారం లేపుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంది చంద్రబాబూ కాదా అని ప్రశ్నించారు. విశాఖలో లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిపై ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో అన్ని శాఖలను నిర్వీర్యం చేశారన్నారు. బాలకృష్ణ వియ్యంకుడు ఎకరం లక్ష రూపాయలకు కొన్నట్లుగా ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు. నిరుద్యోగ భృతి పేరిట యువతను చంద్రబాబు మోసం చేశారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ గ్రామ సచివాలయాలు పెట్టి నిరుద్యోగులను ఆదుకుంటున్నారన్నారు.