మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
మహిళలకు 50 శాతం రిజర్వేషన్ గొప్ప విషయం
07 Sep 2019 2:35 PM
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
జగ్గయ్యపేట: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు సముచిత స్థానం కల్పించారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని గుర్తుచేశారు. జగ్గయ్యపేట పట్టణంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వం దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తుందని, తద్వారా మహిళల జీవితాల్లో ఆనందం నింపిన గొప్ప వ్యక్తి సీఎం వైయస్ జగన్ అని గుర్తుచేశారు. అనంతరం ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ వంద రోజుల పాలన పట్ల ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. వంద రోజుల్లో ప్రజలందరి మన్నలను పొందిన సీఎంగా వైయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు.