కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం వైయస్ జగన్కు ఆహ్వానం
21 Sep 2022 11:04 AM
బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రిక ముఖ్యమంత్రికి అందజేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
సచివాలయం: శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ను తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏ.వీ ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్కు స్వామివారి ప్రసాదాలు, శేష వస్త్రాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందజేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై, రాష్ట్ర ప్రజల తరపున పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా సీఎం వైయస్.జగన్కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబరు 5 వ తేదీవరకు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.