నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
సీఎం వైయస్ జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం
04 Feb 2022 12:58 PM
విజయవాడ : కాపు ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను తొలగించడం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి కాపులు క్షీరాభిషేకం నిర్వహించారు. విజయవాడ నగరంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, కాపు సంఘాల నేతలు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అడపా శేషు మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారన్నారు. రైలు ఘటనలో కేసులు పూర్తిగా రద్దు చేశారన్నారు. కాపు సోదరులకు మంచి జీఓ ఇస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు స్పందించే మనసు రాలేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్క్రిప్టుకే కాదు.. ఇలాంటి వాటికి కూడా పవన్ స్పందించాలన్నారు. కాపు సోదరులకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కిందన్నారు. వైయస్ జగన్ చెబితే చేస్తాడనేది జగమెరిగిన సత్యమన్నారు. కుల, మత, ప్రాంత, జాతి భేదాలు లేని సీఎంను బాధపెట్టకూడదన్నారు. ప్రతిపక్షాల తీరు మార్చుకోకపోతే ఈసారి డిపాజిట్లు కూడా దక్కవని అడపా శేషు పేర్కొన్నారు.