ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ 
 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ డిమాండు చేశారు. పార్లమెంట్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఆర్థికాభివృద్ధికి కేంద్రం తోడ్పాటు అందించాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందని, ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 

 

Read Also: మతి తక్కువ మాటలు మానుకో బాబూ

Back to Top