ఎన్నికలంటే విపక్షాలు ఎందుకు పారిపోతున్నాయి?

ఈసీని మేనేజ్‌ చేసే స్థాయికి చంద్రబాబు దిగజారారు

కరోనా వ్యాధిని చంద్రబాబే కనుక్కొన్నట్లు పచ్చ మీడియా ప్రచారం

ఎన్నికలకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు?

బాబు, కన్నా, పవన్‌ రాష్ట్రానికి చేసిందేమీ లేదు

సీఎం వైయస్‌ జగన్‌ చేసే మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లకూడదనే బాబు లక్ష్యం 

ఈసీ కోడ్‌ పేరుతో ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకున్నారు

టీడీపీ ఆదేశాలతోనే ఈసీ పని చేస్తోంది

ఎన్నికలు ఎప్పుడొచ్చినా భయపడం

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ 

తాడేపల్లి: వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే విపక్షాల పని అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలంటే విపక్షాలు ఎందుకు పారిపోతున్నాయని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ, పవన్‌ ..ఈ ముగ్గురు ఒక్కటే అని, వీరికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో వీరు ఒక్కసారి కూడా బీజేపీని ప్రశ్నించలేదని తప్పుపట్టారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు.

ఎన్నికలకు ఆటంకం కలిగించడానికి మొదటి నుంచి కూడా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. అటు న్యాయ స్థానాలు, ఇటు ఎన్నికల కమిషన్‌ నెపంతో ఎన్నికలను ఎదుర్కొలేకపోతున్నారు. ప్రభుత్వాలు సహజంగా ఎన్నికలకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తాయి. కానీ ఇక్కడ విచిత్రంగా ప్రభుత్వమే ఎన్నికలు పెడతామని ముందుకు వస్తోంది. ప్రజలకు మంచి చేస్తే మాకు మంచి జరుగుతుందని మా ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు వచ్చింది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని, డబ్బులు, మద్యం పంపిణీ చేయకూడదని చట్టం చేశాం. చంద్రబాబు మొదలు ఆయన చెంచా పవన్‌ కళ్యాణ్‌, బాబు మౌత్‌ వాయిస్‌ అయిన కన్నా లక్ష్మీనారాయణ, వామపక్షాలు అన్నీ కూడా వైయస్‌ జగన్‌పై ఈ 9 నెలల్లో అనేక ఆరోపణలు చేశారు. సింగిల్‌గా వైయస్‌ జగన్‌ ఎన్నికలకు వెళ్తుంటే ఎందుకు చంద్రబాబు భయపడుతున్నారు. వైయస్‌ జగన్‌పై నీవు చేసిన అపవాదులు కరెక్ట్‌ అయితే ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పు  ఇస్తారు కదా? ఎందుకు ఎన్నికలు వాయిదా వేయించారు. మీరు రాయించిన స్రిప్ట్‌నే కమిషనర్‌ చదివారు.

రాష్ట్రంలో ఒక్కకేసు మాత్రమే పాయిటివ్‌గా నమోదు అయింది. మోదీ మొదలు మా సీఎం వైయస్‌ జగన్‌ వరకు శుభ్రత గురించి చెప్పారు. చంద్రబాబు మాత్రం కరోనాను ఆయనే కనుగొన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజలకు మనోధైర్యం కలిగించాలి. రాష్ట్రంలో లేని కరోనాను ఉన్నట్లుగా చెప్పడం దారుణం. చంద్రబాబు అండ్‌కో ఇదే పని చేస్తూ రాష్ట్ర బ్రాండ్‌ను దెబ్బతిస్తున్నారు.  ఎన్నికలు పూర్తి అయితే సుమారు రూ.5 వేల కోట్లు వస్తాయి. వైయస్‌ జగన్‌పై వీరంతా పందుల్లా దాడి చేస్తున్నారు. రాష్ట్రానికి మంచి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ తపన పడుతుంటే..నిన్న కన్నా లక్ష్మీనారాయణ ప్రెస్‌మీట్‌లో సీఎం వైయస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

కన్నా.. అసలు నీకు బుద్ధిందా? అన్నం తింటున్నావా? పెంట తింటున్నావా? నీవు ఒక మనిషివి అయితే ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి మాట్లాడు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావాలి. మీలాంటి వారి సహకారం లేకపోయినా వైయస్‌ జగన్‌ ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు, కన్నా, పవన్‌..ఈ ముగ్గురిది ఒకే మాట. వేరే వేరే వేదికలు ఉన్నాయి అంతే. పవన్‌ మాట్లాడితే చాలు ఢిల్లీలో ఫిర్యాదు చేస్తా అంటున్నారు. ఈ 9 నెలల్లో పవన్‌ నీవేం చేశావ్‌. గతంలో పాచిపోయిన లడ్డూ అన్నావు. ఈ రోజు ఒక్క లడ్డైనా తీసుకురాగలిగావా?. ఇప్పుడేమో ఎన్నికలు రద్దు చేయాలంటున్నావు. నీవేవో షూటింగ్‌లు చేసుకోవచ్చు.అందుకోసం ఇక్కడ ఎన్నికలు ఆపేయాలా?. ప్రజలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి బీజేపీని అడగలేకపోతున్నారు. కన్నాను, పవన్‌ను, చంద్రబాబు కొడునుకు ప్రజలు చిత్తుగా ఓడించారు కాబట్టి ఈ రాష్ట్రానికి మంచి జరుగకూడదని వీరి ఉద్దేశ్యం. మా సీఎం కోరిక ఒక్కటే. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ఎన్నికలకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఉగాది నాటికి 26 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వాటిని కూడా పంచకూడదని, ఎన్నికల కోడ్‌ ఉందని చెప్పారు. ఇవన్నీ అడ్డుకుంది మీరు కాదా? ఈ ఆరువారాల పాటు ఎన్నికలు జరుగకపోతే రాష్ట్రంలో పాలన ఎలా సాగుతుంది. అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది. టీడీపీ ఆదేశాల మేరకే ఎన్నికల కమిషన్‌ పని చేస్తోంది.

ఒక సీఎస్‌ ఒక లెటర్‌ రాస్తే..ఎందుకు స్పందించడం లేదు. రాష్ట్ర ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత సీఎం వైయస్‌ జగన్‌పై, ఈ ప్రభుత్వంపై ఉంది. మీరేందుకు అడ్డుకుంటున్నారు. చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు ఇలా వ్యవహరిస్తున్నారు. కన్నా, పవన్‌ మీరు కేంద్రంతో మాట్లాడి నిధులు ఇప్పించండి. ఈ రాష్ట్రంలో 9 నెలల పరిపాలన మీద వైయస్‌ జగన్‌ ఎన్నికలకు వెళ్తున్నారు. బాబు, కన్నా, పవన్‌ ఎందుకు పారిపోతున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నాను. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎప్పుడైనా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి ఒక్క సూచన అయినా చేశారా? ఎప్పుడూ కూడా వైయస్‌ జగన్‌పై నెగిటివ్‌గా మాట్లాడటం. వైయస్‌ జగన్‌ మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నారు.ఇతర రాష్ట్రాల కంటే క్షుణ్ణంగా పని చేస్తున్నారు. చంద్రబాబు మాదిరిగా ప్రకృతిని మార్చలేరు కానీ, ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మేం తప్పకుండా తీసుకుంటాం. సుప్రీం కోర్టు తలుపు తట్టాం. తప్పకుండా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. ఈ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయంటే కారణం టీడీపీ, అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే. చంద్రబాబు మెప్పుకోసమే ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. విజయవాడలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా 64 వార్డుల్లో అన్ని స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు గెలవడం ఖాయం. ఇప్పటికైనా ఎన్నికల కమిషనర్‌ మనసు మార్చుకొని ఎన్నికలు యధాతధంగా నిర్వహించాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కోరారు.

Back to Top