మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
మాఫియాకు కళ్లెం వేసేందుకే నూతన ఇసుక పాలసీ
05 Sep 2019 4:59 PM
పంచాయతీ రాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
నందిగామ: ప్రజలందరికీ ఇసుక ధరలు అందుబాటులో ఉండాలని సీఎం వైయస్ జగన్ నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చారని పంచాయతీ రాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నందిగామ నియోజకవర్గం చెవిటికల్లు ప్రాంతంలో ఇసుక రీచ్, ఇసుక నిల్వ అమ్మక కేంద్రాన్ని ఎమ్మెల్యేలు జగన్మోహన్రావు, సామినేని ఉదయభానులతో కలిసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకే సీఎం నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చారన్నారు. గత పాలకులు ఏ విధంగా ఇసుకను దోచుకున్నారో ప్రజలంతా గమనించారన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఇసుక మాఫియాకు చంద్రబాబే లీడర్గా వ్యవహరించారని గుర్తుచేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చంద్రబాబు ప్రభుత్వానికి రూ. 100 కోట్ల జరిమానా కూడా విధించిందన్నారు. ప్రతి ఒక్కరికీ ఇసుక అందుబాటు ధరలో ఉండాలని సీఎం వైయస్ జగన్ కొత్త పాలసీ తీసుకువచ్చారన్నారు. ఎవరైనా ఇసుక కావాల్సిన వారు తహసీల్దార్ కార్యాలయం, మీ సేవా, ఇసుక రీచ్ల వద్ద అధికారులను సంప్రదించవచ్చన్నారు.