హ‌రీష్‌రావు దుష్ట‌చ‌తుష్ట‌యం చెంతన‌ చేరాడు

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున

విజయవాడ: తెలంగాణ మంత్రి హరీష్‌రావు దుష్టచతుష్టయం చెంతన చేరిపోయాడని, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలకు అమ్ముడుపోయాడని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. హరీష్‌రావు వ్యాఖ్యలను మంత్రి మేరుగు నాగార్జున తీవ్రంగా ఖండించారు. హరీష్‌రావుకు, వాళ్ల మామ కేసీఆర్‌కు విభేదాలు ఉన్నాయేమో తమకు తెలీదని,  ఏదైనా ఉంటే వారి రాష్ట్రంలో వారు తేల్చుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యా వ్యవస్థను దేశమంతా మెచ్చుకుంటోందన్నారు. విద్యా వ్యవస్థలో సీఎం వైయస్‌ జగన్‌ తీసుకొచ్చిన సంస్కరణలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. 
 

Back to Top