ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
అర్హత కలిగిన ప్రతి రైతుకు వైయస్ఆర్ రైతు భరోసా
18 Sep 2019 3:10 PM
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
కాకినాడ: అర్హత కలిగిన ప్రతి రైతు, కౌలు రైతుకు వైయస్ఆర్ రైతు భరోసా పథకం అందుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతు భరోసా పథకం లబ్ధిదారుల కోసం ఈ నెల 25వ తేదీ వరకు సర్వే కొనసాగుతుందన్నారు. కాకినాడలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. సర్వే కోసం మోనటరింగ్ కమిటీలను నియమించినట్లు చెప్పారు. సర్వేను వేగవంతంగా పూర్తి చేయడానికి వలంటీర్లతో కలిసి వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు పనిచేయాలని ఆదేశించినట్లు వివరించారు. లబ్ధిదారుల జాబితాలో అర్హత కలిగిన ప్రతి రైతు, కౌలు రైతు ఉండాలని సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. రైతు భరోసా కింద రైతులకు ఇచ్చే సొమ్మును వేరొక రుణాలకు జమ చేయకూడదని బ్యాంకర్లను సీఎం ఆదేశించారన్నారు.