మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలవరం ఆలస్యం
10 Feb 2023 11:22 AM
చంద్రబాబు అనాలోచిత చర్యలతో ప్రాజెక్టు నిర్మాణంలో సమస్యలు
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి అంబటి రాంబాబు
ఏలూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ప్రాజెక్టులోని లోయర్ కాఫర్ డ్యామ్, డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందన్నారు. కాఫర్ డ్యామ్ పనులను గత ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన కాఫర్డ్యామ్ ఎత్తు పెంచామని చెప్పారు. చంద్రబాబు అనాలోచని నిర్ణయాలు, తొందరపాటు చర్యలతో పోలవరం ప్రాజెక్టులో సమస్యలు తలెత్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులు సకాలంలో నిధులు విడుదల చేయకపోయినా ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.