రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా వ్యవహరించలేదా?
24 Jun 2020 5:20 PM
రహస్యభేటీని వర్లరామయ్య ఎందుకు భుజానికెత్తుకున్నారు?
ట్విట్టర్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్న
తాడేపల్లి: పార్కు హయత్ హోటల్లో సుజనా చౌదరి, నిమ్మగడ్డ రమేష్కుమార్, కామినేని శ్రీనివాస్ల రహస్యభేటీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. `తాడిచెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడ గడ్డికోసం అన్నాడో ప్రబుద్ధుడు. స్టార్ హోటళ్లో ఎందుకు కలిశారంటే ఆ ముగ్గురూ చెప్తున్న సమాధానాలు ఇలానే ఉన్నాయి. నిమ్మగడ్డ 6వ ఫ్లోర్ వరకూ లిఫ్టులో వెళ్లి అక్కడనుంచి 8వ లిఫ్టు వరకూ నడుచుకుని వెళ్లి వారితో ఎందుకు భేటీ అయ్యారు?`
`సుజనా, కామినేని బీజేపీ మనుషులన్న టీడీపీ, కేంద్రానికి విజ్ఞాపనపత్రం తయారుచేయడానికే మీటింగు పెట్టుకున్నారంటూ ఈ రహస్యభేటీని టీడీపీ నేత వర్లరామయ్య తన భుజాలమీదకు ఎందుకు ఎత్తుకున్నారు? ఇలాంటి పన్నాగాలు చేసే నిమ్మగడ్డ నిష్పక్షపాతంగా ఎలా ఉంటారు?`
`బీజేపీ ముసుగు వేసుకున్న టీడీపీ నాయకులతో భేటీ కుమ్మక్కు కాదా? స్థానిక ఎన్నికల్లో నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా వ్యవహరించలేదా? స్టార్ హోటల్ వ్యవహారాన్ని కోర్టుల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదంటారా?` అని సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీట్ చేశారు.