తాడేపల్లి: ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబు ఒక్కడే అని డిప్యూటీ సిఎం, మైనార్టీ శాఖ మంత్రి ఎస్బీ అంజాద్ బాషా విమర్శించారు. అంజాద్ బాషా మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. - ధరణికోటలో చంద్రబాబు మైనార్టీలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నడూ లేని ప్రేమ ఒలకబోస్తున్నాడు - చంద్రబాబు ఒక ఊసరవెల్లి..అవసరం ఉన్నప్పుడు రంగులు మార్చే వ్యక్తి - మళ్లీ గద్దెనెక్కాలంటే ఖచ్చితంగా మైనార్టీల ఓట్లు అవసరమని ఇప్పుడు చంద్రబాబు గ్రహించాడు - అందుకే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ వల్లమాలిన ప్రేమను చూపిస్తున్నారు - దీన్ని రాష్ట్రంలోని ప్రతి ముస్లిం మైనార్టీ సోదరులు గమనించాలి - జగన్ గారు అన్నీ అబద్దాలే చెప్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు - మహానేత డాక్టర్ వైయస్సార్ శాసనసభ సాక్షిగానే చంద్రబాబు నిజం మాట్లాడితే ఆయన తల వెయ్యి వక్కలవుతుందని చెప్పారు - అలాంటి వ్యక్తి వైయస్ జగన్గారి గురించి మాట్లాడే అర్హత లేదు - మైనార్టీలను ఎక్కువ న్యాయం చేసిన పార్టీ టీడీపీ అనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది నీ 14 ఏళ్ల పాలనలో కార్యాచరణ ఏమైంది..?: - ఇన్నాళ్లకు మైనార్టీల కోసం కార్యాచరణ రూపొందిస్తాను అంటున్నాడు - 2024లో తాను అధికారంలోకి వస్తే కానీ మైనార్టీలకు మేలు చేస్తాను అంటున్నాడు - తన 14 ఏళ్లలో చంద్రబాబుకు మైనార్టీలు గుర్తుకురాలేదా..? - అప్పుడు ఆయన మైనార్టీల కోసం కార్యాచరణ ఎందుకు రూపొందించలేదు..? - ఇప్పుడొచ్చి కార్యాచరణ అంటే ముస్లిం మైనార్టీలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు - నువ్వు చెప్పే అబద్దపు మాటలు వినడానికి ఎవరూ చెవిలో పూలు పెట్టుకుని లేరు - నిన్ను విశ్వసించాలంటే నీ గత చరిత్రను కూడా తెలుసుకోవాలి..రాష్ట్రంలోని మైనార్టీలందరికీ నీ చరిత్ర అంతా తెలుసు - నీకు ఎప్పుడు అవసరమవుతుందో అప్పుడు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుంటావు - నువ్వు ఒంటరిగా పోటీ చేసి ఏనాడూ ముఖ్యమంత్రివి కాలేదు - మామకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు - ఆ తర్వాత ఆయన ఒంటరిగా ఏనాడూ పోటీ చేయలేదు - నీతో జతకట్టిన వారిని కూడా వెన్నుపోటు పొడవడానికి కూడా వెనుకాడని వ్యక్తి చంద్రబాబు బీజేపీతో జతకట్టను అన్న మాట 2014లో ఏమైంది బాబూ..: - 1999లో పార్టీ బీజేపీతో జతకట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. - ఆనాడు మైనార్టీల మనోభావాలు చంద్రబాబుకు గుర్తుకురాలేదు - చంద్రబాబు తన అధికార దాహం తీర్చుకునేందుకు మైనార్టీలనే కాదు..ఎవర్నైనా వెన్నుపోటు పొడవగలడు - ఎందాకైనా వెళ్లి ఎంత నీచరాజకీయానికైనా ఒడిగట్టగల సమర్ధుడు - ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక చట్టాలు తెస్తానంటున్నాడు. - ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాలు ఎందుకు తీసుకురాలేకపోయాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి - ఇప్పుడు కొత్తగా మైనార్టీలకు హామీలు ఇస్తున్నాడు..మైనార్టీలు ఎవరూ చంద్రబాబును నమ్మవద్దు - చంద్రబాబు తన స్వార్ధం కోసం ఎవరి గొంతైనా కోయగల వ్యక్తి చంద్రబాబు - 2004లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబుకు కనువిప్పు కలిగిందన్నాడు - 2009లో మళ్లీ మైనార్టీలతో సమావేశం పెట్టి చారిత్రాత్మక తప్పిదం చేశాను..బీజేపీతో జతకట్టను..నన్ను క్షమించండి అన్నాడు - రాబోయే రోజుల్లో ఆ తప్పును పునరావృతం చేయనని చెంపలేసుకున్నాడు - క్షమాపణ కోరిన చంద్రబాబు మళ్లీ 2014లో అదే మతతత్వ పార్టీ బీజేపీతో జత కట్టి అధికారంలోకి వచ్చాడు - ఇలాంటి రంగులు, మాటలు మార్చే వ్యక్తి దేశంలో చంద్రబాబు ఒక్కడే - ఊసరివెల్లికి కొన్ని రంగులే ఉంటాయేమో కానీ..సమయం, సందర్భాన్ని బట్టి చంద్రబాబు ఏ రంగైనా మార్చగలడు - అలా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మైనార్టీ సామాజికవర్గాన్ని అణగదొక్కాడు హిందూపురంలో బావమరిది కోసం మైనార్టీనే పక్కనపెట్టాడు: - చంద్రబాబు వ్యక్తిత్వం, జగన్గారి వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాలి - 2014లో హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్ధుల్ ఘని ఉన్నాడు. - అలాంటి ఎమ్మెల్యేని తన సొంత బావమరిది బాలకృష్ణ కోసం సీటు ఇవ్వకుండా పక్కన పెట్టేశాడు - కడప సీటు తన సొంత మేనమామ రవీంద్రనాథ్రెడ్డి కావాలని అడిగినా జగన్ గారు ఇవ్వలేదు - కడప మైనార్టీల సీటు..నేను జీవించినంత కాలం అది మైనార్టీలకేనని, సొంత మేనమామను కూడా పక్కన పెట్టిన వ్యక్తి జగన్ గారు అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమం: - రాజకీయాలకు చంద్రబాబే పూర్తిగా అనర్హుడు - ఆయన జగన్ గారి రాజకీయ అర్హత గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది - సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి, రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలను మోసం చేసిన చంద్రబాబు రాజకీయాలకు ఏ మాత్రం అర్హుడు కాదు - మా నాయకుడు ప్రాంతాలు, వర్గాలు, కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు - అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న వ్యక్తి శ్రీ వైఎస్ జగన్ - అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు మన రాష్ట్రం వైపు చూస్తున్నారు - వారి రాష్ట్రాల్లో మన విన్నూత్న విధానాలు, పథకాలను అమలు చేసుకోవాలని ఆలోచనలు చేస్తున్నారు - నీ ఫ్రస్టేషన్ లెవెల్ ఏ స్థాయికి చేరిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు మైనార్టీల రాజ్యాధికారం కల ఇప్పుడు నెరవేరుతోంది: - దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో జగన్ గారి నాయకత్వంలో మైనార్టీలకు మేలు జరుగుతోంది. - ఒక సామాజికవర్గం ఎదగాలంటే, అభివృద్ధి వైపు దూసుకెళ్లాలంటే కచ్చితంగా వారికి రాజకీయ ప్రాధాన్యం కల్పించాల్సి ఉంది - అనేక దశాబ్ధాలుగా మైనార్టీల కల కూడా అదే. - ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి..ఎందరో ముఖ్యమంత్రులు వచ్చినా మా కల నెరవేరలేదు - ఒక్క మహానేత డాక్టర్ వైఎస్సార్ మాత్రమే మైనార్టీలకు పెద్ద పీట వేశారు - మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్, ఫీజ్ రీఎంబర్స్మెంట్, దుల్హన్ వంటి పథకాలను కూడా ప్రవేశపెట్టారు - దుల్హన్ పథకాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ప్రవేశపెడితే దాన్ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నాడు - ఈ ప్రభుత్వంలో వైయస్ జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం షాదీతోఫా కింద మైనార్టీలకు లక్ష రూపాయలు ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా సంక్షేమ పండుగే: - రంజాన్, సంక్రాంతి తోఫా అనేవి పేదలకు మేలు చేయాలని చంద్రబాబు ప్రారంభించిన పథకాలు కావు - తన సొంత లాభం కోసం, హెరిటేజ్లో వస్తువులను అమ్ముకోవడం కోసం బూజుపట్టిన బెల్లం, నాణ్యతలేని పప్పు ఇచ్చి చంద్రబాబు సొమ్ము చేసుకున్నాడు - ఆ బూజుపట్టిన వస్తువులు ఇచ్చి ముస్లిం సోదరులకు గొప్ప మేలు చేసినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నాడు - మా ప్రభుత్వం ప్రతి పేదవాడని ఆదుకోవాలని నవరత్నాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నాం - పండుగలు ఏటా రెండో మూడో వస్తాయి..కానీ మా పథకాల ద్వారా ప్రతి నెలా ఒక పండుగ వస్తోంది - వైఎస్సార్ ఆసరా, అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి పథకాలతో ప్రతి నెలా పేదలకు మేలు జరుగుతోంది. - ఎక్కడా అవినీతికి, లంచాలకు తావులేకుండా అర్హత ఉంటే చాలు అందరికీ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మాది మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశాడు: - 2014లో ఒకే ఒక్క మైనార్టీకి సీటిచ్చి..అతను కూడా ఓడిపోయేలా చేశాడు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మంత్రివర్గంలో మైనార్టీలకు అవకాశం లేని ప్రభుత్వం ఒక్క చంద్రబాబు ప్రభుత్వమే - యూపీలో బీజేపీకి చెందిన యోగీ ఆదిత్యనాథ్ కూడా మైనార్టీలకు టిక్కెట్ ఇవ్వకపోయినా...మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చాడు - 2014లో మైనార్టీలు తనకు ఓటు వేయలేదని మాపై కక్షపూరితంగా వ్యవహరించాడు - ఆ పార్టీలోని మైనార్టీ నాయకులకు అపాయింట్మెంటు కూడా ఇవ్వలేదు - హిందూపురంలో అబ్దుల్ ఘనికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడు - పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ జెండా మోసిన లాల్జాన్బాషా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టిన వ్యక్తి చంద్రబాబు - నంద్యాలలో ఫరూక్ ని కూడా పక్కన పెట్టాడు. నంద్యాల ఉప ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబుకు మైనార్టీలు గుర్తుకు వచ్చారు - మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశాడు - నంద్యాలలో 60వేలకు పైగా మైనార్టీల ఓట్లు ఉండటంతో మొసలి కన్నీరు కార్చాడు - అక్కడ గెలిచిన తర్వాత ఎన్నికలు నాలుగైదు నెలల ఉండగా మైనార్టీ నేతలకు పదవులు ఇచ్చాడు - మా నాయకుడు వైఎస్ జగన్ గారు తాను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే మైనార్టీలకు పెద్ద పీట వేశాడు - జగన్ గారు ఐదుగురు టిక్కెట్లు ఇస్తే నలుగురు గెలిచారు..ఇక్బాల్ ఓడిపోతే శాసనమండలిలో అవకాశం ఇచ్చారు - మైనార్టీగా ఉన్న నన్ను ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత జగన్ గారికే దక్కుతుంది - శాసన మండలిలో నలుగురు మైనార్టీలకు అవకాశం కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా నలుగురికి అవకాశం లేదు - మా సోదరి జఖియాఖానంకు డిప్యూటీ ఛైర్మన్ పదవి కూడా ఇచ్చి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు సబ్ప్లాన్ రాష్ట్రంలో అమలవుతుందని కూడా తెలియదా చంంద్రబాబూ..?: - ఇప్పుడు సబ్ ప్లాన్ తీసుకొస్తాను అని చంద్రబాబు దొంగ హామీలు ఇస్తున్నాడు - ఇప్పటికే మన రాష్ట్రంలో జగన్ గారు మైనార్టీలకు సబ్ ప్లాన్ తీసుకొచ్చారన్న విషయం చంద్రబాబుకు తెలియదా..? - ఉర్ధూ బాషను రెండో అధికార బాషగా చేశానని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది - రాష్ట్ర విభజన తర్వాత ఉర్ధూ తన రెండో అధికార బాష హోదాను కోల్పోయింది - ఈ నేపథ్యంలో తన ఐదేళ్లలో దానికి రెండో అధికార బాషగా మార్చడంలో చంద్రబాబు కనీస ఆలోచన కూడా చేయలేదు - రాష్ట్ర వ్యాప్తంగా ఉర్ధూను రెండో బాషగా చేస్తూ శ్రీ వైఎస్ జగన్ గారు చట్టాన్ని చేశారు - కేంద్రంతో మాట్లాడి హజ్ వెళ్లేవారు హైదరాబాద్ వెళ్లకుండానే రాష్ట్రంలో ఎంబార్కేషన్ పాయింట్ తీసుకొచ్చారు - 2023 నుంచి విజయవాడ నుంచే హజ్ యాత్రకు గౌరవంగా పంపుతాం - హాజీలందరికీ ఆర్ధిక సాయం అందిస్తున్న ప్రభుత్వం ఒక్క జగన్గారి ప్రభుత్వమే - ప్రతి హాజీకి వారి ఆదాయపరిమితి ప్రకారం రూ.60 వేలు, రూ.30 వేల చొప్పున వారి ఖర్చుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది - గత ఏడాది సుమారు రూ.5.5 కోట్లు హాజీలకు ఆర్ధిక సాయం అందించాం - ఇమామ్, మౌజంలకు ప్రతి నెలా గ్రీన్ చానల్ ద్వారా రూ.10వేలు, రూ.5 వేల చొప్పున వారి ఖాతాలో జమ చేస్తున్నారు - చంద్రబాబు ఇమామ్, మౌజంలకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.12.60 కోట్లు - మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిగా ఆ సొమ్మును చెల్లించాం - అవసరం తీరిపోయాక కరివేపాకులా తీసేసే చంద్రబాబును నమ్మవద్దు - విశ్వాసానికి మారు పేరు మైనార్టీలు..మేలు చేసిన వారి, కీడు చేసిన వారిని జీవిత కాలం గుర్తుకుపెట్టుకుంటారు - కీడు చేసిన చంద్రబాబులాంటి వ్యక్తిని ముస్లిం సామాజిక వర్గం ఎన్నటికీ నమ్మదు... - ఎన్ని కష్టాలు ఉన్నా మైనార్టీలను చేయిపట్టుకుని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి వెంటే ఉంటుంది - మైనార్టీలు ఎప్పటికీ నిన్ను నమ్మరు బాబూ...నమ్మరు.