ఎల్లుండి సీఎం వైయ‌స్‌ జగన్‌ ఏలూరు జిల్లా దెందులూరు పర్యటన 

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎల్లుండి (03.02.2024) ఏలూరు జిల్లా దెందులూరులో ప‌ర్య‌టించ‌నున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావ సభ – సిద్దం – లో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల్గొన‌నున్నారు.

మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి దెందులూరు చేరుకుంటారు. అక్కడ జరిగే వైయ‌స్ఆర్‌ సీపీ ఎన్నికల శంఖారావ సభ `సిద్దం` బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.  అనంతరం బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.

Back to Top