ఇంటర్‌ విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్‌

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్వీట్‌
 

 అమరావతి‌: ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసే విద్యార్థులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.  ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. కష్టపడి చదివితే... మంచి ఫలితాలు సాధించగలరని వారిలో స్ఫూర్తి నింపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కాగా రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 10,65,156 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 1,411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

Back to Top