మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
క్వారంటైన్ నుంచి ఇంటికి వెళ్లే ఒక్కో వ్యక్తికి రూ.2 వేలు
16 Apr 2020 3:24 PM
చార్జీల నిమిత్తం రూ. 600 చెల్లించాలి
కరోనా నియంత్రణ సమీక్షలో అధికారులకు సీఎం వైయస్ జగన్ ఆదేశం
తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం ముగిసింది. సమావేశంలో లాక్డౌన్ అమలు, రెండో విడత రేషన్ పంపిణీ, క్వారంటైన్, ఐసోలేషన్లలో సదుపాయాలు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ చర్చించారు. ఈ సందర్భంగా కరోనా బాధితులను ఆదుకునేందుకు సీఎం వైయస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్వారంటైన్ పూర్తిచేసుకొని ఇంటికి వెళ్లే వారికి ఒక్కొక్కరికి రూ. 2 వేలు ఆర్థికసాయం అందించాలని, ఇంటికి వెళ్లిన తరువాత పౌష్టికాహారం కోసం ఈ ఆర్థికసాయం ఉపయోగపడుతుందన్నారు. అంతేకాకుండా చార్జీల నిమిత్తం రూ.600 వారికి అందజేయాలని అధికారులను సీఎం వైయస్ జగన్ అందజేశారు. క్వారంటైన్ సమయంలో రోజుకు ఒక్కో వ్యక్తికి రూ. 600 వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్రెడ్డి హాజరయ్యారు.