గవర్నర్‌కు సీఎం వైయ‌స్ జగన్‌ దీపావళి శుభాకాంక్షలు

గ‌వ‌ర్న‌ర్‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్  భేటీ
 

 విజయవాడ : రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైయ‌స్‌ జగన్‌, వైయ‌స్‌ భారతిరెడ్డి శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లారు. హిందువులకు అత్యంత ప్రాశస్త్యమైన దీపావళి పండుగ సందర్భంగా సీఎం వైయ‌స్ జగన్‌.. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియచేశారు. అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై గవర్నర్‌తో ముఖ్యమంత్రి వివరించారు. 

Back to Top