సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాసానికి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మ‌న్‌

ప్ర‌త్యేక విందు అనంత‌రం మంగళం బిర్లాను స‌త్క‌రించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లాను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఘ‌నంగా స‌త్క‌రించారు. బలభద్రపురంలో గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రితో పాటు ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మ‌న్‌ తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. కుమార మంగళం బిర్లాకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తన నివాసంలో ప్రత్యేక విందు ఇచ్చి జ్ఞాపిక అందజేశారు.

Back to Top