మొన్న షిర్డి ప్రయాణం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరణించిన కార్మికులకు వారికి మా పార్టీ తరుపున ప్రగాడ సానుభూతిని తెలియచేస్తున్నాం. నేషన్పాలసి క్రింద రాత్రిపూట ప్రయాణిస్తున్న వారందరికి రాండమ్ చెకప్ చేయాలని గవర్నమెంట్కి లేఖ రాస్తాం. మొన్న జరిగిన ఎన్నికలు ప్రతిపార్టీకి ఓ గుణపాటం లాంటివి. ఎలక్షన్ఫలితాల తర్వాత వాయిలార్ రవిగారు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డిని అరెస్ట్చేయడం తప్పు అయింది అని చెప్పడం అందరు గమనించాలి. జగన్మోహన్రెడ్డి అరెస్ట్కు ముఖ్యకారణం వాయిలార్ రవి అనే ఇండియాటుడే చెప్పింది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కు ముందు అజాద్ నారాయణస్వామి వాయలార్ రవి కలుసుకుని మట్లాడుకుని తర్వాత సోనియా గాందీ అనుమతితో జగన్మోహన్రెడ్డి అరెస్ట్ చేయడం జరిగింది.ప్రధానమంత్రి ఆఫీస్లో ఏమిచెబితే అది సీబీఐ అదిచేస్తుంది. ప్రతిపక్షాలు సీబీఐకి ప్రీడమ్ ఇవ్వాలని కోరుతున్నాయి. అందుకు ఇదే నిదర్శనం. లగడపాటి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలపోంగు అంటున్నారు. లగడపాటికంటే ముందె కాంగ్రెస్ వాళ్ళునిల్సన్ సర్యే చేయించుకున్నారు జగన్మోహన్రెడ్డి అరెస్ట్కు ముందే ఈ సర్యే జరిగింది. సీఎన్ఎన్, ఎన్డీటీవీ, కూడ సర్యేలు చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారపక్షం టీడీపీ, ప్రతిపక్షం వైయస్ ఆర్ కాంగ్రెస్ ప్రజలపక్షంగా మారింది. పార్టీ పెట్టిన దగ్గర నుండి రైతుల పక్షాన అనేక పోరాటాలు చేశాం. ముందు ముందు ప్రతి సమస్యమీద పోరాడతాం. 18 ఎలక్షన్స్లో ఆ సీట్లు మావికావు అని టీడీపీ అంటుంది.రాబోయే 294 సీట్లు తోకూడ సంభందంలేదు అని అంటారేమో. టీడీపీ ఇప్పటికి గ్రహించలేని విషయం ఎంటంటే, ప్రజలు వారి మీఎంత కోపంగా ఉన్నారో ఎందుకు కోపంగా ఉన్నారో అర్దం చేసుకులేక పోతున్నారు. ప్రధానమంత్రిని నేనే నిలబెట్టాను అని చెప్పుకునే వ్యక్తి రాష్ట్రంలో రైతులు 3 సంవత్సరాల రైతులు కరువుకాటకాలతో అల్లాడుతుంటే .సెంట్రల్ గవర్నమెంట్ కు వెళ్ళి రైతులుగురించి కష్టాలు చెప్పి స్పెషన్ ప్యాకేజి అడగలేదు వారి గురించి ఎది అడగలేదు. రాజశేఖరరెడ్డిగారు అధికారంలో కి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిని కలిసి చంద్రబాబు నిర్వకం వల్లా రైతులు ఇబ్బందులు పడ్డారు అని, సాయం కోరితే ప్రధానమంత్రి ఒక్క రాష్ట్రంకి ఇస్తే బాగుండదు అని భారతదేశంలో 31 జిల్లాలకి ఇస్తే అందులో 17 జిల్లాలు ఆంధ్రరాష్ట్రనివే. వేలకోట్లు రైతుల రుణమాఫీచేశాడు రాజశేఖరరెడ్డి గారు, 28 లక్షల మందికి ఫ్రీ కరెంట్ ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఎన్ని మంచి పనులు చేయవచ్చో అని పనులు రాజశేఖరరెడ్డి గారు చేసారు.