మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అవకాశవాద రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెబుతారు..
02 Jan 2019 12:08 PM
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి
శ్రీకాకుళంః అవకాశవాద రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.రాజకీయ అవసరాల కోసం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని స్వల్ప ఆధిక్యంతో అధికారంలోకి వచ్చి ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారన్నారు.టీడీపీ–జనసేనల మధ్య లోపాయికారి సంబంధాలు సాగుతున్నాయని మొదట నుంచి వైయస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తూనే ఉందన్నారు.
ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలతో నిజమైందన్నారు.పవన్కల్యాన్ను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారన్నారు.వైయస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ భరోసా కల్పిస్తున్నారన్నారు.చంద్రబాబు కుతంత్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.అవకాశవాద మాటలతో ప్రజలను వంచిస్తూ,నాలుగున్నరేళ్ల కాలంలో నాలుగున్నర లక్షల కోట్లు లూటీ చేసి అధికారంలో మళ్లీ రావడానికి చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.