286వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్

విజ‌య‌న‌గ‌రం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 286వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. సోమవారం ఉదయం జననేత గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలంలోని నైట్‌క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.

అక్కడి నుంచి చౌదంతి వలస, బొబ్బిలి నియోజకవర్గంలోని పిండ్రంగి వలస, దొంకిన వలస, మీదుగా పెదపల్లి క్రాస్‌, లక్ష్మీపురం క్రాస్‌ వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది.  

Back to Top