282వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూలు


విజయనగరం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 282వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. మంగళవారం ఉదయం చీపురుపల్లి నైట్‌ క్యాంపు నుంచి వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కెన్‌గువా వద్ద గజపతి నగరం నియోజకవర్గంలోకి అడుగుపెడతారు. ముచ్చర్ల చేరుకొని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొండపేట క్రాస్, జిన్నమ్‌ వరకు పాదయాత్ర సాగుతుందని తలశీల రఘురాం తెలిపారు.
 
Back to Top