గుర్ల నుంచి 281వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 

విజ‌య‌న‌గ‌రం :  రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగుతోంది. సోమవారం ఉదయం జననేత 281వ రోజు పాదయాత్రను గుర్ల శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కలవచర్ల, కోటగండ్రేడు, పాలవలస క్రాస్‌, అనందపురం క్రాస్‌ మీదుగా గరికవలస వరకూ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగనుంది. గరిక వలసలో వైయ‌స్‌ జగన్‌ ప్రజలతో మమేకమవుతారు. 

జననేత వైయ‌స్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ఇక ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. వారి సమస్యలను విన్న వైయ‌స్‌ జగన్, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.


తాజా వీడియోలు

Back to Top