మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
విజయ సంకల్ప స్థూపం ఆవిష్కరణ
09 Jan 2019 3:27 PM
పాదయాత్ర ఆఖరి ఘట్టంలో పాల్గొన్న అశేష జనవాహిని
జననేత వెంట తరలివచ్చిన పార్టీ నాయకులు
శ్రీకాకుళం: 14 నెలలుగా ఆంధ్రరాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఆఖరి ఘట్టానికి చేరుకుంది. 341వ రోజు భోజన విరామం అనంతరం వేలాది మంది ప్రజలు కలిసి రాగా వైయస్ జగన్ విజయ సంకల్ప స్థూపం వద్దకు చేరుకున్నారు.
దారి పొడవునా వైయస్ జగన్ సీఎం అంటూ నినాదాలు, శాలువాలతో సత్కారాలు, చల్లగా ఉండాలని సర్వమత ప్రార్థనల అనంతరం వైయస్ జగన్ పైలాన్ వద్దకు చేరుకున్నారు. వేలాది మంది ప్రజల సమక్షంలో పాదయాత్ర స్మ్రతులతో నిర్మించిన పైలాన్ను వైయస్ జగన్ ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్లో నిర్వహించే బహిరంగ సభకు బయల్దేరారు. సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగిస్తారు.