వైయస్ఆర్ కడప : వైయస్ జగన్ ప్రధానిని కలవడంపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఖండించారు. పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...జగన్ నరేంద్రమోదీని కలిస్తే ఎందుకంత భయపడుతున్నారని టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు.<br/>చంద్రబాబు లాగ చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకునే నైజం తమది కాదని వ్యాఖ్యానించారు. టీడీపీ సర్కార్ అవినీతి గురించి వైయస్ జగన్ ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లడంతో భయపడుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో హామీల గురించి ఏ రోజు అయినా మాట్లాడారా అని టీడీపీ నేతలను నిలదీశారు.