కడప: టీటీడీఎల్పీ ఉపనేత రేవంత్రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంలో పట్టుబడ్డ నగదు పట్టిసీమదా? లేక చంద్రన్న కానుకల నుంచి వచ్చిందా ? అన్న విషయం నిగ్గు తేల్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం కడప జిల్లా నందనూరులో సెల్ టవర్పై మృతి చెందిన రైతు మగ్దుల్ కుటుంబాన్ని వైఎస్ఆర్ సీపీ ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యే అంజద్బాషా, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి పరామర్శించారు.<br/>అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. మగ్దుల్ కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణలో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టిఫెన్సన్తో ఫోన్లో మాట్లాడిన టేపులోని వాయిస్ తనదా కాదా అనే విషయాన్ని చంద్రబాబు స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.<strong><br/></strong><strong>'చిచ్చు పెట్టాలనుకోవడం చంద్రబాబు మూర్ఖత్వం' </strong>అనంతపురం: అవినీతి కేసులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూర్ఖత్వమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్టు వ్యవహారంపై సీఎం నైతిక బాధ్యతగా పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.<br/>ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలుంటే వెంటనే బయట పెట్టాలన్నారు. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అధికారం ఏసీబీకి ఉందని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను బ్లాక్ మెయిల్ చేసేందుకే ఏపీలో 87 కేసులు నమోదు చేశారని ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు మంట గలిపారని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. <br/>