బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
నిబంధనలు పేరుతో రేషన్కు గండి..
25 Oct 2018 11:25 AM
రేషన్ కోసం వలసకూలీలు పడిగాపులు..
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన
విజయనగరంః రేషన్ అందక వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. 20 లక్షల వలస కూలీలకు రేషన్ సరుకులు రావడంలేదన్నారు. 19 లక్షల మంది రేషన్కార్డులకు దరఖాస్తు చేసినా మంజూరు చేయడంలేదని మండిపడ్డారు. కరువు పరిస్థితుల్లో కూలీలు వలస పోతుంటే నిబంధనల పేరుతో రేషన్కు గండికొట్టడం అన్యాయమన్నారు. అధికారంలోకి వస్తూ కరువును తీసుకురావడం చంద్రబాబుకు అలవాటన్నారు. రేషన్కు గండి కొట్టి అందుల్లో కూడా మిగుల్చుకోవాలనే ప్రభుత్వ చర్యలు దారుణమన్నారు. దివంగత మహానేత వైయస్ఆర్ హయాంలో అడిగిన ప్రతిఒక్కరికి రేషన్కార్డులు ఇచ్చారని, చంద్రబాబు పాలనలో ఉన్న రేషన్కార్డులను కూడా తీసివేస్తున్నారని మండిపడ్డారు. గత చంద్రబాబు 9 సంవత్సరాల పాలనలో 20 లక్షల నుంచి 30 లక్షల వరుకు రేషన్ కార్డులు ఇస్తే వైయస్ఆర్ హయాంలో 67 లక్షల రేషన్కార్డులు ఇచ్చిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డిది అని అన్నారు. టీడీపీ పాలనలో ప్రజలు రేషన్కార్డులు కోసం పడిగాపులు పడుతున్నారన్నారు.