బాధితులకు అండగా జననేత

అనంతపురం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ  అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి
చేపట్టిన నాలుగో విడత రైతు భరోసా యాత్ర.... అనంతపురం జిల్లాలో ఆరో రోజు
కొనసాగింది. యాత్రలో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలోని కొడిమిలో చేనేత
కార్మికుడు రామాంజనేయులు, నరసనాయనకుంటలో రైతు లక్ష్మానాయక్ కుటుంబాలను
వైఎస్ జగన్ పరామర్శించారు. నారాయణపురం, తపోవనం, రాచానపల్లి, సిండికేట్ నగర్
మీదుగా వైఎస్‌ జగన్‌ పర్యటన సాగింది.

మామిళ్లపల్లిలో
వైఎస్ జగన్ కు  పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.
అక్కడ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వైఎస్ జగన్ పూలమాల వేశారు.
అనంతరం అక్కడి నుంచి కోనాపురం బయలుదేరారు. వైఎస్ జగన్ రైతు భరోసా యాత్రలో
ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ
నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి, శంకర్ నారాయణలతో పాటు మాజీ
ఎమ్మెల్యేలు గుర్నాథ్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
Back to Top